రాష్ట్రీయం

అనాథగా మారిన అమ్మాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/శంషాబాద్, జూలై 5: ఇద్దరూ ప్రేమించుకునే పెళ్లి చేసుకున్నారు. భర్తపై ప్రేమతో ఎక్కడో ఆఫ్రికా దేశం కాంగో నుంచి భారత్‌కు వచ్చి భర్తతో అన్యోన్యంగానే కాపురం చేస్తోంది. ఇద్దరికీ ముద్దులొలికే కూతురూ జన్మించింది. ఎనిమిదేళ్ల పాటు సంతోషంగానే గడిపారు. వాళ్ల కాపురంలోకి ఫేస్‌బుక్ నట్టింట మృత్యువులా ప్రవేశించింది. ఫేస్‌బుక్‌లో ఆమె ఓ విదేశీ కుర్రాడితో మొదలుపెట్టిన స్నేహం, చాటింగ్ ప్రేమగా మారి.. భర్తనే కాదనుకునే పరిస్థితికి తీసుకువచ్చింది. అప్పటికీ ఆమె ఆ విషయాన్ని దాచే ఉంచింది. కానీ అతనికి మాత్రం తెలిసిపోయింది. అంతే.. ఆవేశం ఆగలేదు.. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆమెను నిలదీశాడు.. గొడవపడ్డాడు.. చివరకు తట్టుకోలేక గొంతు నులిమి చంపేశాడు. రెండు పొడవాటి కత్తులు తెచ్చి తాను ప్రేమించి, పెళ్లిచేసుకుని.. తానే చంపుకున్న భార్యను 16 ముక్కలుగా నరికాడు. ఓ బ్యాగులో ఆ మృతదేహపు ముక్కల్ని పెట్టుకుని.. ఏమీ తెలియని కన్నకూతుర్ని వెంటేసుకుని ఎవరూ తెలియని ప్రాంతానికి వెళ్లి తగులబెట్టాడు. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించటంతో జైలుపాలయ్యాడు. చివరకు ఆ దంపతుల సంతానం ఏడేళ్ల పసికూన ఎవరి ఒళ్లో నిద్రపోవాలో తెలియక అనాథలా మారి అమాయకంగా దిక్కులు చూస్తున్న దృశ్యం అందరినీ కలచివేస్తోంది.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సింథియా హత్య కేసు నేపథ్యం ఇది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. భార్యను కిరాతకంగా హత్య చేసి ముక్కలు, ముక్కలుగా కాల్చి చంపిన భర్తను రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ సమీపంలోని మదనపల్లి వద్ద మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నివాసముంటున్న రూపేష్‌కుమార్ ఇంటర్ పూర్తికాగానే సౌత్ ఆఫ్రికాకు వెళ్లాడు. సౌతాఫ్రికా కాంగోకు చెందిన సింథియా(32)అనే యువతిని ప్రేమించి 2008లో ఓ చర్చిలో వివాహం చేసుకున్నాడు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి కాపురముంటున్నాడు. వారికి ఏడు సంవత్సరాల కూతురు సానియా ఉంది. కాగా రూపేష్‌కుమార్ గత కొన్ని రోజులుగా షేర్ మార్కెట్ బిజెనెస్ చేస్తున్నాడు. సింథియా గత ఏడు నెలలుగా ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేస్తోంది.
ఫ్రాన్స్‌కు చెందిన ఓ యువకుడితో ఫేస్‌బుక్ పరిచయం ఏర్పడింది. సింథియా, ఫ్రెంచ్ యువకుడు త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఫేస్‌బుక్ చాటింగ్ ద్వారా భర్త రూపేష్ గుర్తించాడు. ఇది జీర్ణించుకోలేకపోయిన రూపేష్ భార్యతో గొడవపడి ఈ నెల 3న ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. ఉదయమే కూతురు సానియాను స్కూలుకు పంపించి, తిరిగి వస్తూ, రెండు కత్తులు తెచ్చాడు. భార్య మృతదేహాన్ని 16 ముక్కలుగా నరికి ఓ బ్యాగ్‌లో సర్దాడు. సాయంత్రం సానియా ఇంటికి వచ్చిన తరువాత కూతురును కారులోని ముందు సీట్లో కూర్చోబెట్టుకున్నాడు. శంషాబాద్ పరిధిలోని మదనపల్లి పక్కనే వున్న గ్రీన్‌సిటీ వెంచర్‌కు చేరుకున్నాడు. కారులోని సూట్‌కేసును తెరవకుండానే దానిపై పెట్రోలు పోసి తగులబెట్టాడు. తిరిగి వెళ్తుండగా కారు మట్టిదిబ్బలో దిగబడింది. అంతలో చుట్టు ప్రక్కల వారు కారు వద్దకు చేరుకున్నారు. కారు సీటు ముందు కూర్చున్న బాలిక ఎవరని అడిగారు. పక్కనే మంటలు లేస్తుండగా గమనించిన స్థానికులకు రూపేష్ తటపటాయిస్తూ సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు రూపేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడిందని శంషాబాద్ డిసిపి సన్‌ప్రీత్ సింగ్, ఎసిపి అనురాధ మంగళవారం మీడియాకు వివరించారు. రూపేష్ కూతురు సానియాను అతని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు చెప్పారు. సింథియా మృతదేహాన్ని సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు.

చిత్రాలు.. రూపేష్, సింథియా, సానియా (ఫైల్ ఫొటో)
విలేఖరులకు వివరాలు వెల్లడిస్తున్న డిసిపి