రాష్ట్రీయం
తెలుగు రాష్ట్రాల బిజెపి కోర్ కమిటీలతో నేడు అమిత్షా భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, జూలై 7: రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ బలోపేతానికి దృష్టిపెట్టిన బిజెపి అధ్యక్షుడు అమిత్ షా రెండు రాష్ట్రాల కోర్ కమిటీలతో శుక్రవారం సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు అమిత్ షా నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పార్టీ కోర్ కమిటి సమావేశం జరగనుంది. అందుకోసం గురువారం ఢిల్లీకి చేరుకొన్న ఏపీ బిజెపి నాయకులు ఢిల్లీలోని ఎంపీ కంభపాటి హరిబాబు నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఏపీ భాజపా నేతలతో పాటు ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు.
అనంతరం సిద్ధార్థ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అన్ని రాష్ట్రాల పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారని, అందులో భాగంగానే ఏపీ నాయకులతో సమావేశం అవుతున్నారని చెప్పారు. ఏపీ నూతన అధ్యక్షుడి ఎన్నికకు దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కోర్కమిటీతో సమావేశం జరుగుతుంది. రాష్ట్ర ఇన్చార్జి కృష్ణదాస్, హన్స్రాజ్ అహిర్, సాధన్ సింగ్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర నేతల సమావేశం జరుగుతుంది.