తెలంగాణ

ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా సుభాష్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డిని నియమించారు. శేరి సుభాష్‌రెడ్డి నియామకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ఖరారు చేశారు.
పరిశ్రమల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తుంది. మెదక్ జిల్లాకు చెందిన శేరి సుభాష్‌రెడ్డి టిఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్నారు. శేరి సుభాష్‌రెడ్డి పుట్టిన రోజునే ఈ నిర్ణయం వెలువడింది. మే నెలలోనే నామినేటెడ్ పదవుల పంపకాన్ని పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి పార్టీ ప్లీనరీ సందర్భంగా ప్రకటించారు.
అయితే కొన్ని మార్కెట్ కమిటీలు, కార్పొరేషన్ చైర్మన్ పదవులను మాత్రమే భర్తీ చేశారు. తిరిగి పదవుల పంపకాన్ని ప్రారంభించారు. శేరి సుభాష్‌రెడ్డితో పాటు ఒకటి రెండు రోజుల్లో మరికొన్ని నామినేటెడ్ పదవులకు నియామకాలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కసరత్తు సాగిస్తున్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ కలిసిన సుభాష్‌రెడ్డి