రాష్ట్రీయం
ఆందోళన వద్దు: కడియం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వరంగల్, జూలై 28: ఎంసెట్-2 లీక్పై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. గురువారం వరంగల్లో విలేఖరులతో మాట్లాడుతూ ఎంసెట్-2 లీక్పై సిఐడిచే విచారణ జరిపిస్తున్నందున ఈ విషయంపై తానేమీ మాట్లాడినా తప్పుడు సంకేతం వెళ్తుందని.. సిఐడి నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంసెట్-2 లీక్పై రాద్ధాంతం అనవసరమన్నారు. లీక్ విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా సీరియస్గా ఉన్నారని, కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా విసిల నియామకాల జీఓను హైకోర్టు నిలిపివేస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ హైకోర్టు తీర్పు కాపీ తనకు ఇంకా అందలేదని, అందిన వెంటనే దీనిపై స్పందిస్తానని అన్నారు.
చిత్రం.. డిప్యూటీ సిఎంను కలిసిన మెడిసిన్ ర్యాంకర్లు..తల్లిదండ్రులు