రాష్ట్రీయం

పిడుగుపాటుకు ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాపురం, జూలై 28: నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో వర్షం మొదలై పిడుగు పడటంతో దాని దాటికి ముగ్గురు వ్యక్తులు, ఐదు మేకలు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చీకవోలు గ్రామానికి చెందిన నారిబోయిన సుబ్రహ్మణ్యం, ఎల్లంపల్లి పాపయ్య గ్రామ సమీపంలోని చేపలగుంట వద్దకు కాపలాకు వెళ్లారు. పాపయ్య తన ఐదు మేకలను సమీపంలో ఉన్న తన గుడిసెలో కట్టాడు. వర్షం మొదలై దగ్గరలోనే పిడుగు పడటంతో సుబ్రహ్మణ్యం (35), పాపయ్య (55)తో పాటు ఐదు మేకలు మృతి చెందాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ రాజేంద్ర (25) మృతి చెందగా, నాయుడు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం అతన్ని వైద్యశాలకు తరలించారు.