రాష్ట్రీయం

బాబుతో జైట్లీ మంతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదనలపై చర్చించారు. తెలుగు దేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, లోక్‌సభలో పార్టీ పక్షం నాయకుడు తోట నరసింహం, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు అరగంట సేపు జరిగిన ఈ సమావేశంలో కేంద్రం ఇవ్వజూపుతున్న ప్రత్యేక ప్యాకేజీ గురించి అరుణ్ జైట్లీ వివరించినట్టు చెబుతున్నారు. ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో అంతకంటే కొద్దిగా ఎక్కువ ప్రయోజనాన్ని ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కల్పిస్తామని జైట్లీ వివరించినట్టు తెలిసింది. చంద్రబాబు మాత్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేయగా అన్ని విషయాలను శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశమైనప్పుడు మాట్లాడుకుందామని జైట్లీ చెప్పినట్టు తెలిసింది.