ఆంధ్రప్రదేశ్‌

పంద్రాగస్టుకు ‘అనంత’ ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 9: 70వ స్వాతంత్య్ర దినోత్సవ రాష్టస్థ్రాయి వేడుకలకు అనంతపురం వేదిక కాబోతోంది. ఇందుకు నగరంలోని పోలీసు ట్రైనింగ్ కాలేజీ (పిటిసి) స్టేడియం వేదిక కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రూ.3 కోట్లు విడుదల చేసింది. దీంతో గత పది రోజులుగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 10 నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాల్సి ఉన్నా, పూర్తిస్థాయిలో 13వ తేదీ నాటికి స్టేడియం ముస్తాబు కానుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా నగరాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. క్లాక్‌టవర్‌తోపాటు ట్రాఫిక్ ఐల్యాండ్స్, ఇతర ముఖ్య ప్రదేశాలను విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రంగుల బెలూన్స్ స్టేడియంపై ఎగుర వేయనున్నారు. సుమారు 3000 మంది విద్యార్థినీ, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పరిటాల సునీత మంగళవారం సాయంత్రం పరిశీలించారు.