ఆంధ్రప్రదేశ్
ఎనిమిదోసారి పుష్కర స్నానం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 14 August 2016
ఇబ్రహీంపట్నం/మైలవరం, ఆగస్టు 13: ఇప్పటి వరకూ తాను ఎనిమిది పుష్కరాలలో స్నానం చేసి జన్మధన్యం చేసుకున్నానని ఒక పండు వృద్ధురాలు తన అనుభూతిని ఆంధ్రభూమితో పంచుకుంది. ఇబ్రహీంపట్నానికి చెందిన చిలుకూరి స్వరాజ్యలక్ష్మి(90) అనే వృద్ధురాలు పోలీసుల సాయంతో ఇబ్రహీంపట్నంలోని సంగమం ఘాట్లో పుణ్యపుష్కర స్నానం చేయటానికి వచ్చింది. నడవలేని ఈమెను పోలీసులు వీల్ చైర్లో పుష్కర స్నానానికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా ఆమెను పలుకరించగా తాను ఇప్పటి వరకూ గోదావరి, కృష్ణా పుష్కరాలలో 8 సార్లు స్నానం చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా నదుల అనసంధానం ప్రాంతంలో తాను పుష్కర స్నానం చేయటం కొత్త అనుభూతిని మిగిల్చిందని ఆనందం వ్యక్తం చేశారు.