రాష్ట్రీయం

నరుూంపై కాంగ్రెస్ దారులు వేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: దావూద్ ఇబ్రహీంలా డాన్ అవతారమెత్తాలనుకుని పోలీసుల చేతిలో హతమైన నరుూముద్దీన్‌తో ప్రముఖులకు ఉన్న లింకులపై విచారణ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం కనిపించడం లేదు. ఈ విషయంలో శాసనసభాపక్ష నేత ఒకదారిలో వెళుతుంటే శాసనమండలి నేత, ఇతర ప్రముఖులు అందుకు భిన్నమైన వాదన వినిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది. నరుూముద్దీన్ ఎన్‌కౌంటర్, ఆ తర్వాత అతనితో పోలీసు, రాజకీయ నాయకులకు ఉన్న సంబంధాలపై మీడియాలో పుంఖానుపుంఖాల కథనాలు వెలువడుతున్నాయి. అధికార తెరాస ప్రముఖులతోపాటు, ప్రస్తుతం ఉన్నత హోదాలో ఉన్న పోలీసు అధికారులతోనూ నరుూమ్ చెట్టపట్టాల్ వేసుకుని తిరిగారని, వారితో మాట్లాడిన ప్రతిసారీ ఫోన్ సంభాషణలను రికార్డు చేశారన్న కథనాలు వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలో కెసిఆర్ ప్రభుత్వం అన్ని వ్యవహారాలపై సిట్ ఏర్పాటుచేసింది. అయితే, సిట్ దర్యాప్తు వల్ల న్యాయం జరగకపోగా, వాస్తవాలు సమాధి అవుతాయన్న వాదన వినిపిస్తోంది. అందుకే సిబిఐ విచారణ జరిపించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నేతల్లో మాత్రం విభిన్న డిమాండ్లు వినిపిస్తుండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. నరుూమ్‌కు సంబంధించి జరుగుతున్న సిట్ విచారణ సరిపోతుందని సిఎల్‌పి నేత జానారెడ్డి తాజాగా స్పష్టం చేశారు. సిట్‌తో అన్ని విషయాలు వెలుగుచూస్తాయన్న నమ్మకం ఉందని, అందులో వాస్తవాలు బయటకపోతే అప్పుడు సిబిఐ గురించి ఆలోచించవచ్చని వ్యాఖ్యానించారు. కానీ విధానమండలిలో కాంగ్రెస్ నేత, షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి, విహెచ్ తదితర అగ్రనేతలంతా సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. నరుూమ్ వద్ద దొరికినట్లు చెబుతున్న 2కోట్ల కంటే ఇంకా ఎక్కువ డబ్బు దొరికినట్లు తన వద్ద సమాచారం ఉందని షబ్బీర్ వెల్లడించారు. సోహ్రాబుద్దీన్ కేసుకు, నరుూముద్దీన్ ఎన్‌కౌంటర్‌కు సంబంధం ఉందనిపిస్తోందని, పైగా ప్రధాని వచ్చి వెళ్లిన మరుసటిరోజే ఎన్‌కౌంటర్ జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇవన్నీ వెలుగు చూడాలంటే సిబిఐ విచారణే సరైనది వాదించారు. పైగా ఈ కేసులో తెరాస నేతలే ఎక్కువగా ఉన్నందున, సిట్‌తో నిష్పక్షపాత విచారణ సాధ్యం కానందున, సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు జానారెడ్డి సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా జానారెడ్డి వ్యాఖ్యలతో విభేదించి, సిబిఐ విచారణ డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరుూమ్ తనను బెదిరించాడన్నారు. నరుూమ్‌తో 95 శాతం తెరాస ప్రముఖులకు సన్నిహిత సంబంధాలున్నందున, సిట్‌తో నిష్పాక్షిక విచారణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాజ్యసభ మాజీ ఎంపి వి.హనుమంతరావుకూడా నరుూమ్ వ్యవహారంపై విచారణకు సిట్ సరిపోదని, సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే, నల్లగొండ జిల్లాకు చెందిన పీసీసీ చీఫ్ కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రం ఈ విషయంలో ఎలాంటి డిమాండ్ వినిపించకుండా వౌనంగా ఉండటం గమనార్హం.