రాష్ట్రీయం

అంతు చూస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను తనపైన ప్రయోగిస్తే అంతుచూసే వరకు ఊరుకోను అని ఏడాదిపాటు శాసనసభ నుంచి సస్పెండైన వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా అన్నారు. మంగళవారం ఆమె లోటస్‌పాండ్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మహిళలంతా కంతతడి పెడుతున్నారని, ఇది చంద్రబాబు వంశానికి, కుటుంబానికి మంచిది కాదన్నారు. ఏపి అసెంబ్లీ ఎన్టీఆర్ భవన్‌లా తయారైందన్నారు. టిడిపి సభ్యులు తన పట్ల నీచంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను దళిత మహిళా ఎమ్మెల్యేలను తిట్టినట్లు వచ్చిన అభియోగాల్లో నిజం లేదన్నారు. మహిళలను, ఎస్సీ, ఎస్టీలను అడ్డుపెట్టుకుని కాల్‌మనీ రాకెట్ నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. తమ పార్టీకి, తనకు ఎస్టీ, ఎస్టీలంటే అపారమైన గౌరవం ఉందన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఎవరినీ నమ్మరన్నారు. రెవెన్యూ అధికారి వనజాక్షిదే తప్పని అసెంబ్లీ చంద్రబాబు పేర్కొనడం దారుణమన్నారు. నారాయణ కాలేజీలో 18 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే తల్లితండ్రులు ఎలా రోదిస్తున్నారో చూడరా అని ఆమె అన్నారు. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడిని అదే అసెంబ్లీ నుంచి ఏడిపించి పంపించారంటే ఎంత మానసిక క్షోభకు గురై మరణించారో అర్ధమవుతుందన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలను ఇష్టం వచ్చినట్లు పోలీసులు విజయవాడలో కొడితే మహిళా ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న రోజా