తెలంగాణ

తెరాసలో వందలాది నరుూంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాంపల్లి, ఆగస్టు 26: తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ఆస్తులు, డాక్యుమెంట్లు సంపాదించిన నరుూంను పెంచి పోషించి హతం చేసి టిఆర్‌ఎస్‌లో వంద మంది నరుూంలను తయారు చేసిందని నల్లగొండ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నాంపల్లిలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో నరుూం 20వేల కోట్ల రూపాయలు పోగు చేశాడని, అతన్ని హతం చేసి అట్టి డబ్బును టిఆర్‌ఎస్ నాయకులు వారి స్వలాభాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. నరుూం వ్యవహారాలపై సిబిఐ విచారణ జరగాలని.. అతని వెంట ఉన్న 200 మంది అనుచరులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతుందని, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, రుణమాఫీ మిషన్ భగీరథ, వాటర్ గ్రిడ్ వంటి పథకాలు చేపట్టి వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తుందని మండి పడ్డారు. సిట్ రాష్ట్ర కమిటీలో టిఆర్‌ఎస్ నాయకుల పేర్లు ఉన్నా ప్రభుత్వం అరెస్టు చేయకపోవడం శోచనీయమన్నారు. అలాగే, 15వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ సోనియాగాంధీని కేసిఆర్ విమర్శించడం సిగ్గుచేటని, ప్రాజెక్టుల పేరిట డిజైన్లు మార్చి వేల కోట్ల రూపాయలను కుటుంబం మొత్తం దోచుకుంటుందని ఎద్దేవా చేశారు.