తెలంగాణ

అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థిని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/వనస్థలిపురం, ఆగస్టు 26: అనుమానాస్పదస్థితిలో ఓ ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నగరంలోని ఎల్‌బినగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. సెంట్రల్ బ్యాంక్ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య రెసిడెన్షియల్ క్యాంపస్‌లో ఎంపిసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మహబూబ్‌నగర్ జిల్లా వాడపల్లి మండలం పరిధిలోని తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన కె.శివశంకర్‌రెడ్డి కూతురు అన్విత్‌రెడ్డి శుక్రవారం హాస్టల్‌లోని బాత్‌రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాచుపల్లిలోని శ్రీ చైతన్య క్యాంపస్‌లో చదువుతున్న ఆమె నెల రోజుల క్రితమే వనస్థలిపురం క్యాంపస్‌లోకి మారిందన్నారు. అనుమానాస్పదస్థితిలో ఉన్న అన్విత్‌రెడ్డి మృతిపై విచారణ జరిపి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అన్ని విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మెజిస్టీరియల్ విచారణ జరిపించాలి
ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న మహబుబ్‌నగర్ జిల్లాకు చెందిన అనిత రెడ్డి(16) బాత్రుమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కళశాల యాజమాన్యం పోలీసులతో కుమ్ముకై ప్రేమవ్యవహరంగాను, కడుపు నొప్పి కారణంగా ఉరివేసుకున్నట్లు యాజమాన్యం చిత్రికరించే అవకశాలు జరుగుతున్నయని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అనురాదారావు ఆరోపించారు. కాని వస్తావానికి కాలేజీ మార్కుల కోసం చేసిన వత్తిడి కారణంగానే విద్యార్థిని ఆత్మహత్య సంఘటన చోటుచేసుకుంది ఆరోపించారు. శ్రీ చైతన్య ఆయజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరుపాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది.