రాష్ట్రీయం

ఇద్దరు సిఎస్‌ల పదవీకాలం పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 29: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న సత్యప్రకాష్ టక్కర్, రాజీవ్ శర్మ మరో మూడు నెలలపాటు అదే పదవుల్లో కొనసాగనున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. టక్కర్, రాజీవ్ శర్మ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరో మూడు నెలలు వారి సర్వీసులను పొడిగించాలని కోరుతూ కేంద్రానికి లేఖలు రాశారు. ఈ లేఖలపై స్పందించిన కేంద్రం వారి పదవీకాలం పొడిగించేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. కేంద్రం ఆమోద ముద్ర వేసిందని ఒక సీనియర్ అధికారి తెలిపారు.

చిత్రాలు..తెలంగాణ సిఎస్ రాజీవ్‌శర్మ
ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఎస్‌పి టక్కర్