రాష్ట్రీయం

ఏం చేయాలో ఆలోచిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి ఏం చేయాలో అంతా కలిసి ఆలోచిద్దామని అందుకు విపక్ష సభ్యులు కలిసి రావాలని సిఎం పేర్కొన్నారు. దాదాపు నిరంతరంగా నిరసనలు, పదే పదే వాయిదాల నేపథ్యంలోనే జిఎస్‌టి బిల్లును ఆమోదించిన తరువాత కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై సిఎం ప్రకటన చేస్తారని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. అయితే అప్పటికే వైకాపా సభ్యులు పోడియంను చుట్టిముట్టి నినాదాలు చేస్తున్నారు. అయినా సిఎం చంద్రబాబు ప్రకటన చేసేందుకు ఉద్యుక్తులయ్యారు. ప్రతిపక్ష సభ్యులు అడుగుతున్న అంశంపైనే తాను ప్రకటన చేస్తానని, సభ్యులు అంతా వచ్చి తమ సీట్లలో కూర్చోవాలని సిఎం కోరారు. ఏ మాత్రం రాష్ట్రప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉన్నా సీట్లలో కూర్చోవాలని పదే పదే ముఖ్యమంత్రి కోరారు. అయితే విపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో నినాదాలు చేయడంతో స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.