రాష్ట్రీయం

ఏపి సెట్‌కు ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 10: అధ్యాపక పోస్టుల నియామకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు (ఎపిసెట్)ను 100 కేంద్రాల్లో ఆదివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ నిర్వాహకులు తెలిపారు. ఈ పరీక్షకు 56,452 మంది హాజరు కానున్నారు. మూడు పేపర్లను అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. ఉదయం 9.30 గంటల నుంచి 10.45 గంటల వరకూ మొదటి పేపరు, రెండో పేపరు 11.15 నుంచి 12.30 గంటల వరకూ, మూడో పేపరు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ జరుగుతుంది. ఆరు రీజియన్ల పరిధిలో 100 కేంద్రాలు ఏర్పాటు చేయగా, విశాఖలో 23 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 20న కీ విడుదల చేస్తారు. అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు యుజిసి జారీ చేసే మార్గదర్శకాల అనుగుణంగా నిర్ణయిస్తారు.