రాష్ట్రీయం

ఎంబిఎ, ఎంసిఎ కాలేజీల్లో పూర్తయిన ప్రవేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణలో ఎంబిఎ, ఎంసిఎ కాలేజీల్లో తుది విడత కౌనె్సలింగ్ ప్రక్రియను శనివారం పూర్తి చేసినట్టు అడ్మిషన్ల కన్వీనర్ డాక్టర్ ఎం వి రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 296 ఎంబిఎ కాలేజీల్లో 22648 సీట్లకు 22,532 మందికి సీట్లు కేటాయించామని, అలాగే 38 ఎంసిఎ కాలేజీల్లో 1909 సీట్లకుగానూ 1822 సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. రెండో విడతలో సీట్లు పొందిన వారు ఈ నెల 28వ తేదీలోగా ఫీజును చెల్లించాల్సి ఉంటుందని కాలేజీల్లో 29వ తేదీలోగా రిపోర్టు చేయాలని ఆయన పేర్కొన్నారు.