రాష్ట్రీయం

ట్రిబ్యునల్ కేసులన్నీ హైకోర్టుకు బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆర్డినెన్స్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. శాసనసభా సమావేశాలు ప్రస్తుతం జరగడం లేదు కనుక తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు మేరకు గవర్నర్ ఈ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. ఆ ఆర్డినెన్స్ వల్ల ఇక నుంచి ఏపి అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను హైకోర్టులో విచారించనున్నారు.