రాష్ట్రీయం
ఐఐటి జెఇఇ మెయిన్స్ అభ్యర్థులకు 3 చాన్సులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 26 December 2015
హైదరాబాద్, డిసెంబర్ 25: ఐఐటి జెఇఇ మెయిన్స్కు హాజరయ్యే అభ్యర్ధులకు అవకాశాలను మూడుకు పెంచింది. ఇంత వరకూ విద్యార్ధులకు రెండు అవకాశాలు మాత్రమే ఉండగా, దానిని మూడుకు పెంచింది. జెఇఇ మెయిన్స్ పరీక్షను ఆఫ్ లైన్లో 2016 ఏప్రిల్ 3న, ఆన్లైన్లో ఏప్రిల్ 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు. పరీక్షకు రిజిస్ట్రేషన్ డిసెంబర్ 31వ తేదీతో ముగియనుంది. రాష్టస్థ్రాయి నోటిఫికేషన్లకు బదులు జెఇఇ మెయిన్స్ నోటిఫికేషన్ ద్వారా సీట్లు ఇచ్చేందుకు గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, నాగాలాండ్, ఒడిస్సా రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. మెయిన్స్ పరీక్షలో ర్యాంకు ప్రాతిపదికగా అడ్వాన్స్డ్ పరీక్ష జరుగుతుంది.