రాష్ట్రీయం

వరద మింగేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 1: వరద ఉద్ధృతితో ప్రవహిస్తున్న పిల్లివాగులో కారు కొట్టుకుపోయి తల్లి ఐదుగురు పిల్లలు జలసమాధి అయ్యారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం కారేగాం సమీపంలోని పిల్లివాగు వద్ద శనివారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా తడ్కల్‌కు చెందిన జంగం రాజమణి (40) కుమార్తె హస్మిత (2) శనివారం ఉదయం ఆడుకుంటూ వొంటిపై టీ వొంపుకుంది. చిన్నారి శరీరంపై బొబ్బలు లేవడంతో తల్లి రాజమణి ఆందోళనకు గురైంది. ఆ సమయంలో భర్త లేకపోవడంతో, సోదరుడు నవీన్‌కు సమాచారం అందించింది. చిన్నారిని వైద్య చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు రాజమణి తన కుమార్తెలు ప్రియ (7), జ్యోతి (4), కవలలు జ్ఞాన హస్మిత (2), జ్ఞాన సమిత (2), పది నెలల దీపాక్షలను వెంటబెట్టుకుని సోదరుడు నవీన్‌తో కలిసి పిట్లంకు కారులో బయలుదేరారు. కారేగాం సమీపంలోని పిల్లివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో, ఎలా దాటాలోనన్న అయోమయంలోపడ్డారు. చిన్నారి పరిస్థితి చూసి తట్టుకోలేక ధైర్యంగా వాహనాన్ని డ్రైవర్ ఇస్మాయిల్ ముందుకు తీసుకెళ్లడంతో వరద ఉద్ధృతికి అదుపుతప్పి కొట్టుకుపోయింది. కారు డ్రైవర్ ఇస్మాయిల్, రాజమణి సోదరుడు నవీన్‌లు అతి కష్టం మీద బయటపడ్డారు. చెట్టుకొమ్మ పట్టుకుని వేలాడుతున్న ఇద్దరినీ స్థానికులు తాళ్ల సహాయంతో ఒడ్డుకుచేర్చారు. రాజమణి, ఆమె ఐదుగురు సంతానం మాత్రం వరదలో గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఈతగాళ్లు, స్థానికుల సాయంతో గాలింపు నిర్వహించగా, సాయంత్రానికి కారు ఆచూకీ కనుగొన్నారు. కారుసహా నీట మునిగి ఊపిరాడక చనిపోయిన తల్లి, ఐదుగురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. తల్లీ కుమార్తెల దారుణ మరణంతో కారేగాం, తడ్కల్‌లో గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
వారంలో మూడో ప్రమాదం
నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న కుండపోత వానలు నిండు ప్రాణాలు కబళిస్తున్నాయి. వారం క్రితమే జిల్లాలోని వేల్పూర్ మండలం పడిగెల సమీపంలో వాగు ఉద్ధృతిలో కారు కొట్టుకుపోయిన సంఘటనలో అందులో ప్రయాణిస్తున్న ప్రియాంక (25), ఆమె కుమారుడు వర్షిత్ (2)లు మృతి చెందారు. తాజాగా, ఇదే తరహాలో శనివారం పిట్లం మండలం కారేగాం సమీపంలోని పిల్లివాగులో వరద ఉద్ధృతిలో కారు చిక్కుకుని అందులో ప్రయాణిస్తున్న తల్లి, ఐదుగురు సంతానం మృత్యువాత పడటంతో సర్వత్రా విషాదం నెలకొంది. ఐదు రోజుల క్రితమే సదాశివనగర్ మండల కేంద్రంలోని వాగులోపడి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.