రాష్ట్రీయం

అమరావతి నిర్మాణానికి లక్షా 16వేల ఇటుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి లక్షా 16 వేల ఇటుకల కొనుగోలుకు 32 మంది దాతల ద్వారా సేకరించిన మొత్తాన్ని చెక్కు రూపంలో న్యూయార్క్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందజేశారు. ఆదివారం చంద్రబాబును ఆయన నివాసంలో టిడిపి కేంద్ర మీడియా కమిటీ సమన్వయకర్త, ఎపి గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగు లిటరరీ, కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ న్యూయార్క్ మాజీ అధ్యక్షుడు అయిన వెంకటేశ్వరరావు ఓలేటి, డాక్టర్ రాధ ఓలేటిలు కలిసి చెక్కును అందజేశారు. అమరావతి నిర్మాణానికి న్యూయార్క్‌లోని తెలుగువారు చొరవ చూపడం పట్ల నారా చంద్రబాబు నాయుడు వారిని ఈ సందర్భంగా అభినందించారు.