రాష్ట్రీయం

ఇంజనీరింగ్ విద్యార్థి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 29: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఒక ఇంజనీరింగ్ విద్యార్ధి దారుణ హత్యకు గురయ్యాడు. అగంతకులు దారుణంగా కొట్టి పెట్రోల్ పోసి చంపినట్టు తెలుస్తోందని పోలీసులు భావిస్తున్నారు. కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన వై శివ వెంకటేష్ (20) రాజమహేంద్రవరం సమీపంలోని రైట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇసిఇ బ్రాంచిలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఫైనల్ ఇయర్‌లో నాలుగు సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు శుక్రవారం ఇంటినుంచి వెళ్ళిన శివ శనివారం మధ్యాహ్నం శ్రీరాంపురం వెళ్ళే రోడ్డులోని తోటల్లో విగతజీవుడై పడి ఉన్నట్టు బొమ్మూరు పోలీసులకు సమాచారం అందింది. డిఎస్పీ రమేష్ బాబు మాట్లాడుతూ పాతకక్షల నేపథ్యంలో ఈ విద్యార్థిని ఎక్కడో కొట్టి చంపి ఇక్కడకు తీసుకొచ్చి పెట్రోల్ పోసి కాల్చేశారని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఇదిలాఉండగా తమ కుమారుడి ఆచూకీ తెలియడం లేదంటూ శివ తల్లిదండ్రులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కడియం పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది.