రాష్ట్రీయం
ఓటుకు నోటు కేసు విచారణ నేటికి వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 8 November 2016
హైదరాబాద్, నవంబర్ 7: ఓటుకు నోటు కేసు విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి సోమవారం నాడు కోర్టులో తన వాదనలు వినిపించారు. ఓటుకు నోటు కేసులో నిందితులు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారని, ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయారని, నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్తో 2.5 కోట్లతో టిడిపి ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. తన సంభాషణల్లో ‘నన్ను బాసే మీ వద్దకు పంపారు’ అని రేవంత్ పేర్కొన్నారని చెప్పారు. వాదనల అనంతరం కేసును హైకోర్డు విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.