రాష్ట్రీయం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 7: ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రధాన రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఇల్లందు నుండి తెల్లవారుఝామున 5గంటలకు ఖమ్మం బయలుదేరిన టాటా ఏస్ వాహనాన్ని కారేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద లారీ ఢీకొంది. ఈ దుర్ఘటనలో టాటా ఏస్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మరణించగా మరో ఐదుగురికి గాయలయ్యాయి. టాటా ఏస్‌లో డ్రెవర్ సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారు. అయ్యప్పమాల ధరించిన డ్రైవర్ డేరంగుల రవి వాహనాన్ని జాగ్రత్తగానే నడిపాడని ప్రయాణికులు తెలిపారు. ఎదురుగా ఖమ్మం నుండి ఇల్లందు వైపు అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో టాటా ఏస్ తునాతునకలైంది. డ్రైవర్ రవితో పాటు ఖమ్మం ఆసుపత్రికి వెళుతున్న ఇద్దరు యువతులు షేక్ గౌసియా, షేక్ ఆసియా అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. వారిని ఖమ్మం ప్రధాన ఆసుపత్రికి తరలించారు. వాహనంలో చిక్కుకున్న శ్రీరామ ప్రణయ్ అనే బాలుడిని జెసిబిలు, గ్యాస్ వెల్డింగ్ సహాయంతో సురక్షితంగా బయటకు తీశారు. మృతులు ముగ్గురూ ఇల్లందుకు చెందినవారే. గౌసియా తన చెల్లెలు ఆసియాను ఆసుపత్రికి తీసుకెళుతుండగా జరిగిన ఈ దుర్ఘటన స్టేషన్ బస్తీలో విషాదం నింపింది.

చిత్రం.. లారీ కిందకు దూసుకుపోయన టాటా ఏస్ వాహనం