ఆంధ్రప్రదేశ్‌

గిరిజనుల కోసం ఏం చేస్తున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: విశాఖపట్నం మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గిరిజనుల హక్కుల కోసం తీసుకుంటున్న చర్యలు తెలియచేయాలని కోర్టు ఆదేశించింది. శక్తి సంస్థకు చెందిన డాక్టర్ శివరామకృష్ణ అనే పిటిషనర్ దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారించింది. ఈ అంశంపై గ్రామ సభలను నిర్వహించి గిరిజనుల అభిప్రాయాలను సేకరించలేదని ఆయన హైకోర్టుకు నివేదించారు. గిరిజన ప్రాంతంలో బాక్సైట్ మైనింగ్ ఏరియా వస్తుందని కోర్టుకు తెలిపారు. కాగా వచ్చే మంగళవారం నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.