రాష్ట్రీయం

హైదరాబాద్‌లో 25నుంచి డిజిపిల సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మూడురోజుల పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో దేశంలోని వివిధ రాష్ట్రాల డిజిపిల సదస్సు జరుగుతుంది. ఈ సదస్సును 25వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించే అవకాశాలున్నాయి. ఒక వేళ ప్రధానమంత్రి రాని పక్షంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వస్తారు. ఈ సదస్సులో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంతో పాటు దేశం అంతర్గత భద్రతాపరంగా ఎదుర్కొంటున్న పలు సవాళ్లపై పోలీసు ఉన్నతాధికారులు చర్చించనున్నారు. మూడు రోజుల పోలీసు డిజిపిల సదస్సు నేపథ్యంలో పోలీసు అకాడమీని పోలీసు బలగాలు, ఎన్‌ఎస్‌జి బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అకాడమీ లోపల, వెలుపల పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేశారు. ఈ సమావేశంలో దేశంలో పెచ్చుమీరుతున్న నేర ధోరణులు, సైబర్‌నేరాలు, వామపక్ష తీవ్రవాదుల కార్యకలాపాలతో పాటు నకిలీకరెన్సీ నోట్ల చలామణిని అరికట్టడం తదితర అంశాలపై లోతుగా చర్చించనున్నారు.