రాష్ట్రీయం

ఘనంగా దత్తాత్రేయ కుమార్తె వివాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి, డాక్టర్ జిగ్నేష్‌రెడ్డిల వివాహం గురువారం ఉదయం గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, పలువురు మంత్రులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, బిజెపి నేతలు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి, మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు, కేంద్ర మంత్రులు ఎం వెంకయ్యనాయుడు, హంస్‌రాజ్ గంగారాం అహిర్, సుజనా చౌదరి, రామోజీరావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపి బిబి పాటిల్, నటుడు చిరంజీవి, పవన్‌కల్యాణ్, తెలుగు శాసనసభల స్పీకర్‌లు మధుసూధనాచారి, కోడెల శివప్రసాదరావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, స్వామిగౌడ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలి తదితరులు హాజరయ్యారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, తారకరామారావు, హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా అనేక మంది మంత్రులు, ఎంఎల్‌ఎలు, న్యాయమూర్తులు, మాజీ న్యాయాధికారులు హాజరయ్యారు.
chitram...
దత్తాత్రేయ కుమార్తె వివాహానికి హాజరైన
రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు