రాష్ట్రీయం

ప్రధానికి ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25: చండీగఢ్ నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం సాయంత్రం శంషాబాద్ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్, తెలంగాణ డిజిపి అనురాగ శర్మ, ఆంధ్రప్రదేశ్ డిజిపి సాంబశివరావు, తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మంత్రులు కె తారకరామారావు, నాయిని నరసింహరెడ్డి, మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, జోగురామన్న, ఎంపీలు విశే్వశ్వర్‌రెడ్డి, సిఎచ్ మల్లారెడ్డి తదితరులతో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, బిజెపి రాష్ట్ర నాయకులు జి కిషన్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి స్వాగతం పలికారు.
కెసిఆర్, గవర్నర్‌తో మంతనాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాన మంత్రికి రాష్ట్ర ప్రముఖుల స్వాగత కార్యక్రమం పూర్తి అయిన తర్వాత గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్‌ను పక్కకు తీసుకెళ్లి కొద్దిసేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంతనాలు జరపడం విశేషం.

చిత్రం... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలుకుతున్న గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్.
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు స్వాగతం పలుకుతున్న తెలంగాణ డిజిపి అనురాగ శర్మ.