రాష్ట్రీయం

ప్రధానిని సత్కరించిన టి.సిఎం కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 26: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల హైదరాబాద్ పర్యటన ముగించుకుని శనివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. విమానాశ్రయంలో ప్రధానికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు, బిజెపి నాయకులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కెసిఆర్ ప్రధానమంత్రిని శాలువాతో సత్కరించి, వెండి వీణ, ఒక పుస్తకాన్ని బహూకరించారు. ఈ సత్కారానికి ముందు విమానాశ్రయంలో ప్రధాని, ముఖ్యమంత్రి కాసేపు మాట్లాడుకున్నారు. నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై ఇద్దరు చర్చించారు. నోట్ల చలామణి తగ్గించడానికి కృషి చేయాలని అన్నారు. నోట్ల చలామణి తగ్గి ఆన్‌లైన్‌లోనే ఆర్థిక వ్యవహారాలు సాగితే పన్ను ఎగవేత, నకిలీ కరెన్సీకి అవకాశం ఉండదని అన్నారు. మంత్రులు, బిజెపి నాయకులు సమీపంలో ఉండగా, మోదీ, కెసిఆర్ మాత్రమే నోట్ల రద్దు పరిణామాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు.