ఆంధ్రప్రదేశ్‌

ఎంపి గీత వివాదంపై కలెక్టర్‌కు హైకోర్టు నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: అరకు ఎంపి కొత్తపల్లి గీత వాల్మీకి ఎస్టీ తెగకు చెందిన మహిళ అని ధృవీకరిస్తూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయంపై దాఖలై పిల్‌ను హైకోర్టు విచారించింది. ఈ కేసులో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ధర్మాసనం మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను జిల్లా కలెక్టర్ జూలై 27వ తేదీన జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ విశాఖపట్నం జిల్లా అనంతగిరి మాజీ ఎంపిపి శెట్టి గంగాధర స్వామి హైకోర్టులో పిల్ దాఖలు చేవారు. అరకు ఎంపి కొత్తపల్లి గీత తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన వారని, ఆమె క్రైస్తవ ఆది ఆంధ్ర కులానికి చెందిన వారని, బిసిల్లో సి కేటగిరీ కిందకు వస్తారని పిల్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో జిల్లా కలెక్టర్ మూడు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.