రాష్ట్రీయం

మంటల్లో కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ వనస్థలిపురం, డిసెంబర్ 5: హైదరాబాద్ శివారులోని పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు అదుపుతప్పిన ఆల్టో కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారు రెయిలింగ్‌కు రాసుకుంటూ పల్టీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులోని నలుగురు యువకులు సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ టిఎస్ 03ఈఎల్ 6551గా గుర్తించారు. సందెల రాజేశ్వరి పేరిట కారు రిజిస్ట్రేషన్ అయ్యిందని డిసిపి తన్వీర్ ఇక్బాల్ తెలిపారు. మృతులు పరకాలకు చెందిన శివకృష్ణ, శ్రీకాంత్, బెల్లంపల్లికి చెందిన శశిధర్, నర్సక్కపల్లికి చెందిన రాజుగా గుర్తించారు. బిటెక్ చదువుకున్న వీరిలో ఇద్దరు ఎస్‌ఐ పరీక్షలు రాసినట్టు కుటుంబీకులు తెలిపారు. కాగా వీరు తమ స్నేహితుడు భాస్కర్‌ను కోయంబత్తూర్ విమానం ఎక్కించేందుకు ఆదివారం రాత్రి గం. 11.00లకు హన్మకొండ నుంచి బయలుదేరారు. శంషాబాద్‌లో భాస్కర్‌ను విమానం ఎక్కించి తిరుగు ప్రయాణం చేస్తుండగా తెల్లవారుజాము 4.45కు హయత్‌నగర్ మండలం పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం చోటు చేసుకుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.

చిత్రం..ఓఆర్‌ఆర్‌పై సంభవించిన ప్రమాదంలో తగలబడుతున్న కారు