తెలంగాణ

నగదు ఇబ్బందులు వాస్తవమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 7: దేశంలో నల్లధనాన్ని వెలికితీయడానికి కేంద్రం తాజాగా చేపట్టిన పెద్దనోట్ల రద్దు కార్యక్రమం కేవలం ప్రారంభమేనని, దశాబ్దాలుగా అక్రమంగా దాచుకున్న నల్లధనాన్ని బయటకు తీసుకురావటానికి కేంద్రం భవిష్యత్తులో అనేక రకాల చర్యలు తీసుకుంటుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నది వాస్తవమేనని, కానీ దేశప్రయోజనాల కోసం ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు సమర్ధిస్తున్నారని చెప్పారు. వరంగల్ పర్యటన సందర్భంగా బుధవారం బిజెపి అర్బన్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మురళీధర్‌రావు మాట్లాడుతూ ఏ ఇతర దేశాలలో పెద్దనోట్లను రద్దు చేసిన దాఖలాలు లేవని కొన్ని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, కానీ ఇతర దేశాలలో కరెన్సీ ద్వారా లావాదేవీలు పెద్దమొత్తంలో జరగవని అన్నారు. భారతదేశంలో చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 84శాతం వేయి, ఐదువందల నోట్లని, ఈ నోట్ల కారణంగా నల్లధనం పెరిగిపోవటానికి కారణమని చెబుతూ ఈ పాపానికి కారణం దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్‌దేనని ఆరోపించారు. పాకిస్థాన్ నుంచి భారీమొత్తంలో నకిలీ నోట్లు దేశంలోకి ప్రవేశపెడుతున్న కారణంగా ఆకస్మిక నిర్ణయం తప్పలేదని చెప్పారు. ఇక భవిష్యత్తులో లావాదేవీలు అన్ని పూర్తిగా కరెన్సీతో జరపటం సాధ్యం కాదని, క్రమక్రమంగా డిజిటల్ లావాదేవీలకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పారు. పెద్దనోట్ల ప్రభావం దేశ రాజకీయాలపై, ప్రభుత్వ వ్యవస్థపై చాలా పనిచేసిందని, ఈ నోట్ల రద్దుతో మార్పులు తథ్యమని అన్నారు. పెద్దనోట్ల రద్దుతో కలిగే ప్రయోజనాలను ప్రభుత్వానికి సహకరిస్తున్న పేదలకు, వ్యవసాయ వర్గాలకు దక్కేలా కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. పెద్దనోట్ల రద్దుతో ద్రవ్యోల్బణం దిగివస్తుందని, రియల్ ఎస్టేట్, బంగారం ధరలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. పెద్దనోట్ల మార్పిడి, కొత్తనోట్ల చెల్లింపులలో అవకతవకలు జరిగినట్లు తేలితే నష్టపోయేది బ్యాంకు అధికారులు, సిబ్బందేనని అన్నారు.
రాష్ట్రంలో బిజెపి అసలైన ప్రత్యామ్నాయం
రాష్ట్రంలో టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదుగుతోందని మురళీధర్‌రావు తెలిపారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు కొత్త జిల్లాల కమిటీలు ఏర్పాటుచేయక ముందే బిజెపి అన్ని జిల్లాలకు అధ్యక్షుల నియమాకం పూర్తిచేయటం ద్వారా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుందని చెప్పారు. అంతేకాకుండా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనే పార్టీ నిర్ణయంలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లాతోసహ మూడు జిల్లాల అధ్యక్ష పదవులు మహిళలకు ఇచ్చామని అన్నారు. విలేఖరుల సమావేశంలో అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రూరల్ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.