రాష్ట్రీయం

16 లక్షల రూపాయల కొత్త నోట్ల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, డిసెంబర్ 11: మెదక్ జిల్లా రామాయంపేట పోలీసులు ఆదివారం రూ.16 లక్షల కొత్త నోట్లను పట్టుకున్నారు. బాసం శ్రీనివాస్, రాజు అనే వ్యక్తులు కారులో కొత్త నోట్లను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు గొల్పర్తి రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేసి ఈ సొమ్మును పట్టుకున్నామని ఎస్‌ఐ నాగార్జున గౌడ్ తెలిపారు. పట్టుబడిన సొమ్ములో రూ.15.90 లక్షల రెండువేల కొత్త నోట్లు, మరో రూ.10 వేల వంద రూపాయల నోట్లు ఉన్నాయన్నారు. వీరిని విచారించగా, పట్టణానికి చెందిన కోవూరి వెంకట రామలక్ష్మణ్ నుంచి ప్లాట్ కొన్నామని, ఇందుకు సంబంధించిన సొమ్మును తూప్రాన్‌లో ఉన్న గంగం సంతోష్ అనే వ్యక్తికి ఇవ్వడానికి వెళ్తున్నామని చెప్పారని, ఈ సొమ్మును ఆదాయ పన్ను అధికారులకు అప్పగిస్తామని ఎస్‌ఐ వివరించారు.

చిత్రం..పట్టుబడిన నగదును చూపిస్తున్న ఎస్‌ఐ నాగార్జున గౌడ్