రాష్ట్రీయం

నానక్‌రాంగూడ ఘటనలో ఇద్దరు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి, డిసెంబర్ 11: హైదరాబాద్ నగర శివారు లోని నానాక్‌రాంగూడలో ఆరంతస్తుల భవనం కూలిన ఘటనలో గచ్చిబౌలి పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం, హత్యానేరం కింద కేసులు నమోదయ్యాయని, భవనం యజమాని సత్యనారాయణ సింగ్ అలియాస్ సత్తుసింగ్‌ను ఏ1, అతని కుమారుడు అనిల్‌సింగ్‌ను ఏ2, గుత్తేదారు ఏ3, భవనం ప్లానర్ ఏ4గా కేసులు నమోదు చేశామని, వీరిలో భవన యజమాని సత్యనారాయణ సింగ్‌ను, అతని కుమారుడు అనిల్‌సింగ్‌ను ఆదివారం అరెస్టు చేసినట్టు అదనపుడిసిపి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి నానాక్‌రాంగూడలో ఆరంతస్తుల భవనం కూలిన ఘటనలో 11 మంది కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని మాదాపూర్ ఏసిపి రమణకుమార్, సిఐ రమేష్‌కుమార్ పేర్కొన్నారు.