రాష్ట్రీయం

వాయుగుండంగా తుపాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాకాథంలో ఏర్పడిన వార్ధా తుపాను సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు తీరాన్ని దాటే సమయానికి పెను తుపాను నుంచి సాధారణ తుపానుగా మారిందని, మరో ఆరుగంటల అనంతరం తీవ్ర వాయుగుండంగా మారి పశ్చిమదిశగా పయనిస్తుందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలు నెల్లూరు, ప్రకాశంతోపాటు రాయలసీమ జిల్లాలు కడప, చిత్తూరులో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. సముద్రం కల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో మూడో నెంబరు ప్రమాద సూచీని ఎగురవేశారు.