రాష్ట్రీయం
అర్చక సమాఖ్య ఉపాధ్యక్షుడు సీతారామానుజాచార్యులు కన్నుమూత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 23 December 2016
హైదరాబాద్, డిసెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఉపాధ్యక్షుడు ఉదయగిరి సీతారామానుజాచార్యులు అనారోగ్య కారణాలతో బుధవారం మరణించారని సమాఖ్య కార్యదర్శి పెద్దింటి రాంబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకాశం జిల్లా వైఖానస సంఘం, ఒంగోలు ఆగమపాఠశాల కార్యదర్శిగా, తిరుమల శ్రీవైష్ణవ దివ్య సిద్ధాంతి వివర్దినీ సభ కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా ఆయన పనిచేశారన్నారు. సీతారామానుజాచార్యుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సంతాపం తెలియచేస్తున్నట్టు వివరించారు. సంతాపం తెలిపిన వారిలో సమాఖ్య ప్రతినిధులు ఎంఎ శిఖాచార్యులు, కె.్ఫణికుమార్, కెవిఎస్ఆర్ఎన్ ఆచార్యులు, కె.సుబ్బారావు, టి.అనంతాచార్యులు తదితరులు ఉన్నారు.