రాష్ట్రీయం

తీరనున్న కరెన్సీ కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు, ఎటిఎంల వద్ద పడిగాపులు పడాల్సిన కష్టాలు రెండు మూడు రోజులలో పూర్తిగా తీరిపోనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు రెండు వారాలకు విడుదల చేయాల్సిన మొత్తాన్ని ఒకే వారానికి విడుదల చేయడంతో గురువారం నుంచే నోట్ల కష్టాలు తగ్గుముఖం పట్టాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా నెలన్నర రోజులుగా బ్యాంకులలో నగదు కొరతతో ప్రతి ఒక్కరూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నోట్ల కష్టాలు ఈ నెలాఖరుతో తీరిపోనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు రెండు రోజులుగా పెద్ద మొత్తంలో తెలుగు రాష్ట్రాలకు ఆర్‌బిఐ నోట్లను పంపించింది. దీంతో హైదరాబాద్‌లో నెలన్నరగా మూతపడిన ఎటిఎంలు తెరుచుకున్నాయి. బ్యాంకులలో చాలీచాలనంతగా కాకుండా ఒకేసారి రూ. 20 వేల వరకు చెల్లింపులు జరిగాయి. ఒక్కో అకౌంట్‌పై నాలుగు, ఐదు వేలకంటే మించి ఇవ్వని బ్యాంకులు ఇరవై వేల వరకు ఇవ్వడంతో బ్యాంకుల వద్ద జనం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టారు. ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రానికి బుధవారం రూ. 1600 కోట్లు, గురువారం ఆంధ్రప్రదేశ్‌కు రూ. 1500 కోట్లు విడుదల అయినట్టు ఆర్థికశాఖ వర్గాల సమాచారం. సరిపడినన్ని కాకుండా చాలీచాలనన్ని నోట్లను తెలుగు రాష్ట్రాలకు పంపించడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు ఆందోళనను వ్యక్తం చేస్తూ కేంద్రానికి, ఆర్‌బిఐకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తాజాగా లేఖలు రాయడంతో ఈ నెలాఖరు వరకు సరిపడేంత నగదును ఆర్‌బిఐ విడుదల చేసినట్టు అధికార వర్గాల సమాచారం. జనాభాలో, విస్తీర్ణంలో పెద్దదైన ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రానికే ఇప్పటి వరకు ఎక్కువ నోట్లు రావడం విశేషం. పెద్ద నోట్లు రద్దు తర్వాత (నవంబర్ 8) ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి రూ.20,704 కోట్లు అందగా, ఆంధ్రప్రదేశ్‌కు రూ.16,240 కోట్లు అందినట్టు అధికారిక లెక్క. తమ రాష్ట్రంలో నోట్ల కష్టాలను తీర్చడానికి ఎక్కువ మొత్తంలో కరెన్సీని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అధికారులను ఆర్‌బిఐకి పంపించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం బయటికి ఏమాత్రం హడావుడి చేయకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఎప్పటికప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్‌బిఐకి వేర్వేరుగా లేఖలు రాయిస్తూ ఒత్తిడి పెంచారు. ఆంధ్రప్రదేశ్‌కంటే తెలంగాణకే ఎక్కువ కరెన్సీ విడుదల కావడానికి ఇదే కారణమని అధికారులు విశే్లషించారు.