రాష్ట్రీయం

ప్రణబ్ గౌరవార్ధం గవర్నర్ విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ గౌరవార్ధం మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహాన్ విందు ఇచ్చారు. విందులో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు హాజరయ్యారు. కెసిఆర్ చంద్రబాబు, బండారు దత్తాత్రేయ కొద్దిసేపు నోట్ల రద్దు అంశంపై పిచ్చాపాటిగా ముచ్చటించుకున్నారు. ఇరు రాష్ట్రాల స్పీకర్‌లు మధుసూధనాచారి, కోడెల శివప్రసాదరావు, తమిళనాడు మాజీ గవర్నర్ కె రోశయ్య, కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మహమూద్ అలీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపిలు కవిత, కె కేశవరావు, మంత్రులు కె తారక రామారావు, టి హరీశ్‌రావు, తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఏపి మండలి చైర్మన్ చక్రపాణి, పిసిసి నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి, బిజెపి శాసన సభాపక్ష నాయకుడు జి కిషన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. రాజ్‌భవన్‌లో విందుకు సానియా మిర్జా, పివి సింధు హాజరయ్యారు. గవర్నర్‌తో, మంత్రులు కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు.

చిత్రం..రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందులో పాల్గొన్న
రాష్టప్రతి ప్రణబ్, తెలంగాణ సిఎం కెసిఆర్, ఏపి సిఎం చంద్రబాబు