రాష్ట్రీయం

దాసరితో జగన్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు ఇంటికి వెళ్లి ఆయనతో గంటకుపైగా చర్చలు జరిపారు. ప్రస్తుతం దాసరి నారాయణరావు కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నా, క్రియాశీలకంగా లేకపోవడంతో ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. వైఎస్ కుటుంబానికి, తమ కుటుంబానికి మధ్య అనుబంధం చాలా సంవత్సరాల నుంచి ఉందని మీడియాతో దాసరి అన్నారు. వైఎస్ జగన్ మంచి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారని,ప్రజల సమస్యల సాధనకు అలుపులేని పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు. తమ మధ్య జరిగింది మర్యాదపూర్వక సమావేశమేనని, దీనికి రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత లేదన్నారు. జగన్‌కు తన ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. భవిష్యత్తులో ఇంకా పెద్ద నాయకుడుగా జగన్ ఎదగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.
ప్రతిపక్షనేత జగన్ బుధవారం నుంచి అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాలనీ, లోనికుంట గ్రామాల్లో ఆయన పర్యటిస్తారు.