ఆంధ్రప్రదేశ్
కుంభాభిషేక దర్శనం పరమపవిత్రం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 January 2017
శ్రీకాళహస్తి, జనవరి 22: కుంభాభిషేకాన్ని దర్శించడం పరమ పవిత్రమైన కార్యక్రమమని కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అన్నారు. ఆదివారం ఆయన శిష్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయానికి, గాలిగోపురానికి కుంభాభిషేకం నిర్వహించడానికి శ్రీకాళహస్తికి వచ్చినట్లు తెలిపారు. కుంభాభిషేకాన్ని చూడటం ఎంతో పుణ్యప్రదమని, ఇటువంటి కార్యక్రమాలకు భక్తులందరూ హాజరుకావాలని కోరారు. గతంలో జరిగిన కుంభాభిషేకానికి తాను వచ్చానని, మరోసారి కూడా కుంభాభిషేకం చేయించే అవకాశం రావడం అదృష్టమని తెలిపారు.