రాష్ట్రీయం

రైతుల కన్నీరు క్షేమదాయకం కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 22: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక, అమరావతి ప్రాంతంలోని కృష్ణానది లంక భూముల రైతుల కన్నీరు ఆంధ్రప్రదేశ్‌కు క్షేమదాయకం కాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టు పక్కనే ఉన్న మూలలంకలోని 207 ఎకరాల మాగాణి భూమిని రైతుల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డ్‌గా మార్చడం ఎంతవరకు న్యాయమో ప్రజా ప్రతినిధులు చెప్పాలని కోరారు. పోలవరం గుత్తేదారు కంపెనీ అడ్డగోలుగా రైతుల భూమిని డంపింగ్ యార్డ్‌గా మార్చేస్తే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారో అన్న వివేకం కూడా చూపకపోతే ప్రజా ప్రతినిధులను ఏమనుకోవాలని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణ ప్రగతిపై నెలకోమారు సమీక్ష జరుపుతున్న సర్కార్ ఈ సమస్యపై ఎందుకు దృష్టి పెట్టడం లేదో అర్థం కావడం లేదని, ఈ భూముల రైతులు తమ వారు కాదనా లేదా కాంట్రాక్టర్‌కు ఇబ్బందనా అని ప్రశ్నించారు. గత్యంతరం లేని రైతులు తగిన నష్టపరిహారం చెల్లించమని అడిగితే వారి మొర ఎందుకు వినరన్నారు. పోలవరం రైతులు ఇప్పటికే పలు రకాలుగా నష్టపోయారని, ఇది అన్యాయం అని అడిగితే పోలీసులతో కేసులు పెట్టించి వారి నోరు మూయిస్తున్నారన్నారు. ఇది మంచిది కాదు.
ఇకనయినా వారికి న్యాయం చేయాలన్నారు. అమరావతిలోని కృష్ణానది లంక బూముల రైతుల బాధను సమాజ వికాసాన్ని వారు అర్థం చేసుకోవలసి ఉందని, తాము దళితులం అయినందువల్లే తామకు నష్టపరిహారం చెల్లింపులో వివక్షకు గురవుతున్నామని ఈ ప్రాంత రైతులు ఆవేదనతో ఉన్నారన్నారు. ఇది సమాజానికి మంచిది కాదని, అసలు గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం నదీ పరీవాహకంలో ఉన్న భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని, అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తీసుకున్నదో లేదో స్పష్టత లేదన్నారు.
ఈ భూములను తీసుకుని ఏమి చేస్తారో ముందుగా ప్రజలకు లేదా కనీసం రైతులకైనా తెలియచేయాలని, భూముల సేకరణకు ముందు ఎంతమేరకు నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందో అంత ఇవ్వాలన్నారు. పట్టా రైతులకు ఒకలా, లంక భూముల రైతులకు మరోలా వివక్షత పాటించడం మంచిది కాదన్నారు. ఒక వేళ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టే ఆలోచన లేకపోతే వాటిని సాగు భూములుగానే రైతులకు వదిలేయాలని జనసేన డిమాండ్ చేసింది.