రాష్ట్రీయం

చిరుదరహాసం.. కుశల ప్రశ్నలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో గురువారం సాయంత్రం గవర్నర్ నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె చంద్రశేఖర్‌రావు, నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ‘ఎట్ హోం’ ముగిసిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు గవర్నర్ సమక్షంలో పావుగంట పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరువురు ముఖ్యమంత్రులు చిరునవ్వుతో కుశల ప్రశ్నలతో పరస్పరం పలకరించుకున్నారు. వీరు ఇరువురి మధ్య తాజా రాజకీయాలతో పాటు పెద్ద నోట్ల రద్దు తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీ ప్రధానమంత్రికి అందజేసిన నివేదికపై చర్చ జరిగినట్టు సమాచారం. ఇలా ఉండగా ఎట్ హోం కార్యక్రమానికి మాజీ గవర్నర్లు కె రోశయ్య, రంగరాజన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఇరు రాష్ట్రాల స్పీకర్లు మధుసూదనాచారి, కోడెల శివప్రసాద్‌రావు, శాసనమండలి చైర్మన్లు స్వామిగౌడ్, డాక్టర్ చక్రపాణితో తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో గురువారం సాయంత్రం గవర్నర్
నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సిఎం కెసిఆర్, ఏపి సిఎం చంద్రబాబు