రాష్ట్రీయం

తరగతి గదిలో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండ్రుగొండ (ఖమ్మం), జనవరి 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదిలో డస్టర్ కోసం ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో టెన్త్ విద్యార్థి తంబళ్ల భానుప్రసాద్ (15) అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం ఇంటర్వెల్ అనంతరం తరగతి గదిలో తంబళ్ల భానుప్రసాద్, కుక్కమూడి శ్రీనాధ్ మధ్య డస్టర్ విషయంలో వివాదం తలెత్తింది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనాధ్ తోటి విద్యార్థి భాను ప్రసాద్‌పై దాడి చేశాడు. ఈక్రమంలో భానుప్రసాద్ సమీపంలోని బల్లపై పడటంతో తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయాడు. ఉపాధ్యాయులు భానుప్రసాద్‌ను సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. డిఇఓ హయగ్రీవాచారి సంఘటనా స్థలాన్ని సందర్శించి హెచ్‌ఎం బిపిఆర్‌ఎల్ కుమారి, ఫిజికల్ డైరెక్టర్ సృజనను సస్పెండ్ చేశారు.

చిత్రం..మృతుడు భానుప్రసాద్