రాష్ట్రీయం

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జనవరి 29: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందారు. దంతెవాడ జిల్లా కిరండోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురంగేల్ అటవీ ప్రాంతంలో డిఆర్‌జి బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇటీవల ఢోల్‌కల్ పర్వతంపై గణేశ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో దుండగులను పట్టుకునేందుకు దంతెవాడ ఎస్పీ కమలోచన్ కశ్యప్ భద్రు నేతృత్వంలో డిఆర్‌జి బలగాలను కూంబింగ్‌కు పంపించారు. మావోయిస్టులు ఎదురుపడటంతో రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. తరువాత ఘటనా స్థలిలో ఒక మహిళ సహా ఇద్దరు నక్సల్స్ మృతదేహాలు లభ్యమయ్యాయి. రెండు తుపాకులు, భారీగా మందుగుండు సామగ్రి, నిత్యావసర వస్తువులను పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పారిపోయిన మరికొందరు నక్సల్స్‌ను పట్టుకునేందుకు అడవిలో అనే్వషిస్తున్నట్లు ఎస్పీ కమలోచన్ కశ్యప్ వెల్లడించారు.

చిత్రం..నక్సల్స్ మృతదేహాలు