రాష్ట్రీయం

నవ్యశ్రీ క్షేమం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 30: తిరుమలలో కిడ్నాప్ అయిన ఐదేళ్ల చిన్నారి నవ్యశ్రీ పాలమూరు జిల్లాలో క్షేమంగా దొరికింది. అనంతపురం జిల్లా తూముచెర్లకు చెందిన మహాత్మ, వరలక్ష్మి దంపతుల కుమార్తె ఐదేళ్ల నవ్యశ్రీ ఆదివారం ఉదయం తిరుమల కొండపై కిడ్నాప్ అయింది. పాపకోసం పోలీసులు కొండపై ఎంత గాలించినా ప్రయోజనం లేకపోయింది. అయితే నిందితుడు నాటకీయంగా సోమవారం ఉదయం పాలమూరు జిల్లాలో పాపతో సహా పోలీసులకు చిక్కాడు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన వడ్డె బాలస్వామి అనే వ్యక్తి నవ్యశ్రీతో సోమవారం జడ్చర్ల నుండి కల్వకుర్తికి వెళ్తున్న ఆర్టీసి బస్సులో ప్రయాణిస్తున్నాడు. నిందితుడు ముసుగు వేసుకుని ఉండటం, పాప భయంభయంగా బిత్తర చూపులు చూస్తూండటాన్ని తోటి ప్రయాణికుడు గమనించి, అనుమానంతో మిడ్జిల్ పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో మిడ్జిల్ ఎస్సై సైదులు బస్సును ఆపి తనిఖీ చేశారు. ఇది గమనించిన నిందితుడు పాపతో సహా పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే నవ్యశ్రీని కిడ్నాప్ చేయడానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు. పాప దొరికినట్టు మిడ్జిల్ పోలీసులు తిరుమల పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో నవ్యశ్రీ తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది.

చిత్రాలు..ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి నవ్యశ్రీ, కిడ్నాపర్ వడ్డె బాలస్వామి