రాష్ట్రీయం

చిన్నారి ప్రాణం తీసిన క్యాబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: క్యాబ్ ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. సోమవారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రలోని కృష్ణా జిల్లాకు చెందిన ఏసుబాబు, నాగమణి దంపతులు ఏడాది క్రితం నగరానికి వచ్చి దేరవకొండ బస్తీలో కొబ్బరి బోండాల వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. వీరిలో చిన్నదైన మూడేళ్ల నాగత్రివేణి సోమవారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటుండగా అటుగా వెళుతున్న క్యాబ్ చిన్నారిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని హుటాహుటిన నిమ్స్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..చిన్నారి నాగత్రివేణి