రాష్ట్రీయం

మహోజ్వల వేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 9: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో అత్యున్నత స్థానానికి ఎదిగిన మహిళలు శుక్రవారం కృష్ణాతీరంలో కొలువుదీరనున్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద ఉదయం 10 గంటలకు జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన సదస్సులను మరిపించే విధంగా, అత్యంత భారీ స్థాయిలో ఈ సదస్సుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దేశంలో మొదటిసారి జరుగుతున్న ఈ సదస్సులో దాదాపు 12వేల మంది మహిళా ప్రముఖులు పాల్గొనే అవకాశం వుంది. దేశ విదేశాలలో విఖ్యాతి గాంచిన మహిళలతో పాటు, రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 8వేల మంది విద్యార్థినులు ఈ సదస్సులో భాగస్వామ్యం పంచుకోనున్నారు. రాజకీయం, పరిశోధన, విద్య, పారిశ్రామికం, మీడియా, సినీమా, వివిధ కళలు, న్యాయవ్యవస్థ, శాస్త్ర సాంకేతిక తదితర అన్ని రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సదస్సులో చర్చించి, వాటిపై తీర్మానాలు చేయనున్నారు.
శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ప్రారంభ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా, ప్రముఖ గాంధేయవాది ఈలా భట్, సినిమా నటి జూహిచావ్లా, శాసనసభ మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ డిప్యూటీ డైరెక్టర్ కేథరిన్ హే, శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర మంత్రి పీతల సుజాత, సీనియర్ అధికారి పూనం మాలకొండయ్య, సదస్సు కన్వీనర్ ప్రముఖ విద్యావేత్త రాహుల్ వికరద్, సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ డైరక్టర్ డాక్టర్ రంజనీ కుమారి, ముకుల్ మాధవ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ రితూ చాబ్రియా, బంగ్లాదేశ్
పార్లమెంట్ స్పీకర్ డాక్టర్ శిరిన్ షార్మిన్ చౌదరి, భరత్ బయోటెక్ లిమిటెడ్ కో-్ఫండర్ సుచిత్రా ఇల్లా ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.40 వరకు మొదటి ప్లీనరీ సదస్సు జరుగుతుంది. ఈ విభాగంలో మహిళలు రాజకీయంగా ఎదుర్కొనే సమస్యలపై చర్చిస్తారు. స్టాప్ యాసిడ్ ఎటాక్ మిషన్ క్రుసేడర్ లక్ష్మీ అగర్వాల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక గజపతిరాజు, సినిమా నటి మనీషా కోయిరాలా, భారత సంతతికి చెందిన అమెరికా రాజకీయ నాయకురాలు అరుణా మిల్లర్, నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ మహ్మద్ యూనస్, ఆసియన్ న్యూస్ ఇంటర్నేషనల్ ఎడిటర్ స్మితా ప్రకాష్, కెనెటిక్ ఇంజనీరింగ్ ఫౌండర్, వైస్ చైర్‌పర్సన్ సులజ్జా ఫిరోడియా మోట్వానీ, పశ్చిమ ఆఫ్రికా సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కామెరా సనగాకబా ప్రసంగిస్తారు.
సాయంత్రం 4.40 గంటల నుంచి 6.30 గంటల వరకు యువతులు, విద్యార్థినులకు సంబంధించిన సమస్యలపై సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో స్కూల్ గవర్నమెంట్ మిట్ డైరక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ శైలశ్రీ హరిదాస్, తెలంగాణా ఎంపీ కల్వకుంట్ల కవిత, నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య, ఏపి మహిళా స్వయం సేవక సంఘాల కమ్యూనిటీ ఆర్గనైజర్ విజయభారతి ప్రసంగిస్తారు.
కాగా సాయంత్రం వేళ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు పవిత్ర సంగమం వద్ద అమరావతి అంతర్జాతీయ సంగీత నృత్యోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయి.

చిత్రం..మహిళా పార్లమెంట్ సదస్సుకు సిద్ధమైన వేదిక