రాష్ట్రీయం

మావోయిస్టుల ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, ఫిబ్రవరి 9: మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే నెపంతో ఒక గిరిజనుడిని మావోయిస్టులు కత్తులతో దాడిచేసి హత్యచేశారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం సలివెల గ్రామంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా, గురువారం ఉదయం వెలుగుచూసింది. అయితే ఈ హత్యపై పోలీసులు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. సలివెల గ్రామానికి చెందిన మడకం బుచ్చయ్య (36) బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా ఇంటి అరుగుపై నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో పదిమంది వచ్చి బుచ్చయ్య అంటే ఎవరని అడిగారు. తానే బుచ్చయ్యనని తెలపడంతో తమతోపాటు బయటకు రావాలని, మాట్లాడే పనుందన్నారు. అయితే కుటుంబ సభ్యులైన రాములమ్మ, ముత్తయ్య, రమాదేవి ఇంటి వద్దే మాట్లాడాలని కోరారు. అయినా వారి మాటలు లెక్కచేయకుండా బుచ్చయ్యను తమతోపాటు తీసుకువెళ్లారు. బుచ్చయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో రాములమ్మ, ముత్తయ్య వెతుక్కుంటూ వెళ్లారు. ఊరి అవతల ఉన్న గుట్టదాటిన తర్వాత ఉన్న పొలంలో బుచ్చయ్య మృతదేహం కనిపించింది. కత్తులతో దాడిచేయడం వల్ల మృతిచెందాడు. మృతదేహం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ శబరి కమిటీ పేరున ఒక లేఖ వదిలి వెళ్ళారు.