రాష్ట్రీయం

నేడు హైదరాబాద్‌కు బజాజ్ కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం నియమించిన బజాజ్ కమిటీ ఈ నెల 12న హైదరాబాద్‌కు రానుంది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు తెలంగాణ అధికారులతో జలసౌధలో కమిటీ సమావేశమవుతుంది. 14న ఉదయం 7 గంటలకు బయలుదేరి విజయవాడ చేరుకుంటుంది. అక్కడ ఉదయం 11 గంటలకు ఎపి అధికారులతో సమావేశమవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ కమిటీ 15వ తేదీ ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకుంటుంది. అనంతరం 11 గంటలకు ఎపి, తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సంయుక్త సమావేశం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి తిరిగి ఢిల్లీకి వెళ్లిపోతుంది.