రాష్ట్రీయం

మూడేళ్ల బాలికకు వాతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పాతబస్తీ), ఫిబ్రవరి 11: ఓ తల్లి కసాయిగా మారింది. మూడేళ్ల చిన్నారికి అట్లకాడతో ఒళ్లంతా విచక్షణారహితంగా వాతలు పెట్టి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. అట్లకాడ వాతలతో అల్లాడిన ఆ పసికందుకి చికిత్స అందిస్తున్నారు. విజయవాడ నగరంలోని కొత్తపేట పోలీసుల కథనం ప్రకారం పాత రాజరాజేశ్వరి పేటకు చెందిన సాకత్ ఆలీ, ఆష్మా బేగంలకు ఇద్దరు సంతానం. ఆలీ నూడిల్స్ బండితో జీవనం సాగిస్తున్నాడు. వారి పిల్లలు ఖాజీ బాబు (5), షర్మిలా (3). షర్మిలకు గత కొన్ని రోజులుగా విరోచనాలు అవుతున్నాయి. మందులు వాడుతున్నాగాని తగ్గడం లేదు. మాట మాటికీ విరోచనాలు అవుతుండగా బాలికను పలుమార్లు శుభ్రం చేయడానికి విసుగుపుట్టిన అష్మాబేగం శనివారం ఉదయం అట్లకాడ కాల్చి వళ్లంతా విచక్షణా రహితంగా వాతలు పెట్టింది. ఆ పసికూన వాతల బాధతో విలవిల్లాడినా కనికరించని ఆ కసాయి తల్లి బాలికను గట్టిగా పట్టుకుని కాళ్లు, చేతులు, వీపు ఇలా అందినచోటల్లా వాతలు పెట్టింది. సమాచారం అందిన తండ్రి పరుగు పరుగున ఇంటికి వచ్చి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. శాడిస్టుగా వ్యవహరించిన ఆష్మాబేగం గతంలో తన కుమారుడు ఖాజిబాబు తలపై ఇలానే మోది పెద్ద గాయం చేసింది. ఇదే విషయాన్ని ఆమె భర్త పోలీసులకు తెలిపాడు. ఆమె ప్రవర్తనతో విసుగు చెందిన భర్త ఆమెపై చేయి చేసుకోగా గతంలో నిడదవోలు పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేయగా, అనంతరం రాజీపడ్డట్టు తెల్సింది. ఇద్దరు పిల్లల పట్ల ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తించిన ఆమె మానసిక స్థితిని ఆమె భర్త, ఇటు పోలీసులు అంచనా వేయలేకపోతున్నారు. నిందితురాలిపై కేసు నమోదు చేశామని సిఐ దుర్గారావు తెలిపారు.

చిత్రాలు..షర్మిలతో తల్లి ఆష్మా బేగం, ఒంటిపై వాతలతో చిన్నారి షర్మిల