రాష్ట్రీయం
చూస్తూ ఊరుకోం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ, ఫిబ్రవరి 13:కొంతమంది రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. గొడవ చేయడానికి వస్తామంటే పోలీసులు ఊరుకుంటారా అని పరోక్షంగా రోజా వివాదాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. మహిళలను గౌరవించే చర్యల్లో భాగంగా ‘అమ్మకు వందనం’ కార్యక్రమంపై మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇటీవల నిర్వహించిన వివిధ ఈవెంట్లలో మహిళా పార్లమెంట్ తనకు ఎక్కువ సంతృప్తిని ఇచ్చిందన్నారు. వెలగపూడి సచివాలయంలో ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఇమేజ్ను దెబ్బతీయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారన్నారు. అమరావతిని, రాష్ట్రంలో పెట్టుబడుల గురించి ప్రమోట్ చేస్తుంటే, నేర చరితులు పెట్టుబడులు రాకుం డా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది మంచిది కాదని, ప్రజలు, విద్యార్థులు ఆలోచించాలన్నారు. రాష్ట్భ్రావృద్ధి కోసం పని చేస్తున్నానని, తన స్వార్థం కోసం కాదన్నారు. ఈ ప్రక్రియలో తనకు పేరు రావడం యాదృచ్ఛికమేనని వ్యాఖ్యానించారు. దావోస్లో తనను ఒకరు ఆంధ్రప్రదేశ్ అంటే పెట్టుబడులు పెట్టే వారికి భయమని చెప్పగా, గతంలో కాంగ్రెస్ హయాంలో అటువంటి పరిస్థితులు ఉండేవని తాను చెప్పాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో కొంతమంది తలపెట్టిన ఆరాచకాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సమయంలో తుని ఘటన జరిగిందని, విశాఖలో సిఐఐ సదస్సు నిర్వహిస్తున్న సమయంలో రిపబ్లిక్ డే రోజున గొడవ చేయండంటూ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. జల్లికట్టు తరహాలో గొడవ చేయాలని చెప్పారన్నారు. ఆ సమయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రానికి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. తిరుపతిలో కూడా సైన్సు కాంగ్రెస్ను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. మహిళా పార్లమెంట్లో కూడా ఇబ్బంది కలిగించేందుకు వచ్చారని, ఇది దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఇంద్రుని రాజధాని పేరు కూడా అమరావతి అని, అక్కడ కూడా రాక్షసులు ఉన్నారని తెలిపారు. వారిని నియంత్రించేందుకు ఇంద్రుడు కూడా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారన్నారు.
మంత్రివర్గంలో తుది నిర్ణయం
మహిళలను గౌరవించే చర్యల్లో భాగంగా త్వరలో ‘అమ్మకు వందనం’ పేరరుతో కార్యక్రమం నిర్వహించనున్నామని, మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. భార్యను, తల్లిని, చెల్లిని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి డిక్లరేషన్ను ఐక్యరాజ్యసమతి రూపొందిస్తోందన్నారు. జాతీయ మహిళా సదస్సును ఏటా నిర్వహించేందుకు నిర్ణయించామని, ఇతర రాష్ట్రాలు ముందుకు రాకపోతే ఇక్కడే నిర్వహిస్తామని చెప్పారు. నిర్వహణ తీరుపై 80 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. సోషల్ మీడియాలో సానుకూలంగా 26.5 శాతం, తటస్థంగా 55.2 శాతం మంది స్పందించారన్నారు. ఇంతమందిని ప్రభావితం చేసిన ఈ సదస్సు తనకు ఎక్కువ సంతృప్తిని ఇచ్చిందన్నారు. స్పీకర్ మాట్లాడిన దానిలో తప్పేముందని సిఎం ప్రశ్నించారు. ఆయన మాటలను వక్రీకరించడం హేయమని వ్యాఖ్యానించారు. ఎవరికైనా పరిమితులు ఉంటాయని, వాటి పరిధిలో వ్యవహరించాలన్నారు. మగవారితో సమానంగా మహిళల భాగస్వామ్యం పెరిగితే సమాజంలో మార్పు కచ్చితంగా వస్తుందన్నారు.